వైఎస్సార్సీపీ నేత, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విజయవాడలోని అవినాష్ ఇంట్లో మంగళవారం ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని బంజారాహిల్స్లో అవినాష్కు చెందిన ఓ భూమి వ్యవహారంపై ఐదు బృందాల ఐటీ అధికారులు అవినాష్ ఇళ్లపై, ఆఫీసులపై సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే ఐటీ సోదాలపై అధికారులు కానీ, దేవినేని అవినాష్ కానీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా అవినాష్ ఇంటిపై ఐటీ సోదాలను వ్యతిరేకిస్తూ విజయవాడలోని ఆయన ఇంటివద్ద అభిమానులు ఆందోళన చేపట్టారు.
మరోవైపు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని వంశీ రామ్ బిల్డర్స్ కార్యాలయం, సంబంధించిన వారి ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. వంశీరామ్ బిల్డర్స్ యజమాని ఇల్లు, కార్యాలయంతో పాటుగా వారి బంధువుల ఇళ్లలో కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మొత్తం 15 చోట్ల 20కి పైగా ఐటీ అధికారుల బృందాలు సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE