అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో దేశరాజధానిలో తలపెట్టిన మూడు రోజుల ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రైతులు, మహిళలు గురువారం ఢిల్లీకి పయనమ్యయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గత మూడేళ్ళుగా ఉద్యమం చేస్తున్న రైతులు, తాజాగా తమ నిరసనను దేశరాజధాని వేదికగా ఎలుగెత్తి చాటాలని నిర్ణయించుకున్నారు. రాజధాని అంశంలో హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం గౌరవించి, ఆదేశాలను అమలు చేయాలని వారు కోరనున్నారు. ఈ నేపథ్యంలో జేఏసీ నేతృత్వంలో వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ మేరకు అమరావతి పరిరక్షణ సమితి నేతలు ఢిల్లీలో ఈ నెల 17,18,19 తేదీల్లో మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే నేడు అమరావతి ప్రాంత రైతులు, మహిళలు పెద్ద ఎత్తున విజయవాడ నుంచి ప్రత్యేక రైలులో ఢిల్లీకి బయలుదేరారు. భారీ సంఖ్యలో విజయవాడ రైల్వేస్టేషన్ చేరుకున్న వారికి సీపీఐ నేత రామకృష్ణ, కాంగ్రెస్ నేతలు పలువురు సంఘీభావం తెలిపారు. అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు శివారెడ్డి, కార్యదర్శి గద్దె తిరుపతిరావుల నేతృత్వంలో రైతులు, మహిళలు వివిధ పార్టీల ఎంపీలను, నేతలను కలిసి తమ డిమాండ్ వినిపించనున్నారు. ఈ సందర్భంగా రైతులు ఈ నెల 17న జంతర్ మంతర్ వద్ద ధర్నా, 18న అమరావతి రాజధానికి పలు రాష్ట్రాల ఎంపీల మద్దతు కోరడం వంటివి చేపట్టనున్నారు. ఇక చివరిగా డిసెంబర్ 19న రామ్లీలా మైదానంలో జరుగనున్న కిసాన్ సంఘ్ కార్యక్రమంలో వారు పాల్గొననున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ