ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 68,865 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 1,515 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా తూర్పుగోదావరిలో 223, నెల్లూరులో 202, చిత్తూరులో 199, కృష్ణాలో 163, పశ్చిమగోదావరిలో 143, ప్రకాశంలో 132, గుంటూరులో 129 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,09,245 కు చేరుకుంది.
ఇక కరోనా వలన మరో 10 మరణాలు చోటుచేసుకున్నాయి. చిత్తూరులో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, తూర్పుగోదావరిలో ఒకరు, నెల్లూరులో ఒకరు, కర్నూల్ లో ఒకరు, శ్రీకాకుళంలో ఒకరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 13788 కి పెరిగింది. గత 24 గంటల్లో 903 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 19,80,407 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 15,050 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ