బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రేపే ప్రారంభం

Bandi Sanjay Praja Sangrama Yatra, Bandi Sanjay Praja Sangrama Yatra To Start From Tomorrow, Bandi’s padayatra, Bandi’s padayatra to begin today, Mango News, Praja Sangrama Yatra, Praja Sangrama Yatra in Telangana, Praja Sangrama Yatra News, Telangana BJP President, Telangana BJP President Bandi Sanjay, Telangana BJP President Bandi Sanjay Praja Sangrama Yatra, Telangana BJP President Bandi Sanjay Praja Sangrama Yatra To Start From Tomorrow

ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ చేప్పట్టబోతున్న పాదయాత్ర రేపు ప్రారంభం కానుంది. రేపు (ఆగస్టు 28, శనివారం) ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుండి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించనున్నారు. పాదయాత్ర ప్రారంభోత్సవ సభలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్ సహా రాష్ట్ర బీజేపీ నేతలంతా పాల్గొననున్నారు.

మరోవైపు రాష్ట్రంలో బండి సంజయ్ మొదటివిడత పాదయాత్రకు అన్ని ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి. తొలివిడతలో పాదయాత్రను హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం వరకు కొనసాగించనున్నారు. ఇక తొలిరోజు బండి సంజయ్ పాదయాత్ర పూర్తిగా హైద్రాబాద్ నగరంలోనే జరగనుంది. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద మొదలై మదీనా, ఆఫ్జల్ గంజ్, బేగంబజార్, మెజంజాహీ మార్కెట్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, నాంపల్లి, అసెంబ్లీ, లక్డీకాపూల్, మాసాబ్ ట్యాంక్ మీదుగా మెహిదీపట్నం వరకు కొనసాగనుంది. రాష్ట్రంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఈ పాదయాత్రలో పాల్గొననున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =