ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 41,523 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 671 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా పశ్చిమగోదావరిలో 109, చిత్తూరులో 102, గుంటూరులో 91, ప్రకాశంలో 74, కృష్ణాలో 66, తూర్పుగోదావరిలో 65, నెల్లూరులో 57, విశాఖపట్నంలో 52 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,53,863 కు చేరుకుంది.
ఇక కరోనా వలన మరో 11 మరణాలు చోటుచేసుకున్నాయి. కృష్ణాలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఇద్దరు, గుంటూరులో ఒకరు, కడపలో ఒకరు, నెల్లూరులో ఒకరు, శ్రీకాకుళంలో ఒకరు, విజయనగరంలో ఒకరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14219 కి పెరిగింది. గత 24 గంటల్లో 1,272 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 20,30,503 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,141 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ