ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్ళీ పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 31,142 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 1005 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. మార్చి 28, ఆదివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,98,815 కు చేరుకుంది. ఇక కరోనా వలన చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 7205 కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 324 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 8,86,216 కు చేరింది. అలాగే ప్రస్తుతం 5394 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు ఏపీలో మొత్తం 1,49,90,039 కరోనా పరీక్షలను నిర్వహించారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(1005):
- తూర్పుగోదావరి – 25
- కర్నూల్ – 42
- కృష్ణా – 135
- కడప – 21
- గుంటూరు – 225
- చిత్తూరు – 184
- అనంతపూర్ – 36
- నెల్లూరు – 84
- ప్రకాశం – 35
- శ్రీకాకుళం – 22
- విశాఖపట్నం – 167
- విజయనగరం – 13
- పశ్చిమగోదావరి – 16
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ