దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 62,714 కరోనా పాజిటివ్ కేసులు, 312 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,19,71,624 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,61,552 కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, కర్ణాటక, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి 8 రాష్ట్రాల్లోనే 85 శాతం కేసులు నమోదు అయ్యాయి. కరోనా కేసులు భారీగా పెరగడంతో దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 4,86,310 (4.06%) కు చేరుకుంది. మరో 28,739 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 1,13,23,762 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 94.59 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.35 శాతంగా నమోదైంది.
గత 24 గంటల్లో 14 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు లేవు:
కాగా గత 24 గంటల్లో రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, అస్సాం, లక్షద్వీప్, లద్దాఖ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, సిక్కిం, త్రిపుర, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ అండ్ నికోబార్, దాద్రా మరియు నగర్ హవేలి మరియు డామన్ మరియు డయ్యు వంటి 14 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎటువంటి కరోనా మరణాలు సంభవించలేదు.
దేశంలో కరోనా కేసులు వివరాలు (మార్చి 28, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య: 24,09,50,842
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 1,19,71,624
- కొత్తగా నమోదైన కేసులు [మార్చి 27–మార్చి 28 (8AM-8AM)] : 62,714
- నమోదైన మరణాలు : 312
- రికవరీ అయిన వారి సంఖ్య : 1,13,23,762
- యాక్టీవ్ కేసులు : 4,86,310
- మొత్తం మరణాల సంఖ్య : 1,61,552
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ