టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ఇంటిలో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి శ్రీమన్నారాయణ గుండెపోటుతో ఈ రోజు మరణించారు. దేవినేని స్వగ్రామం కంచికచర్ల లో తండ్రి అంత్యక్రియలు జరుపుతారని సమాచారం. కృష్ణా జిల్లా టీడీపీలో బలమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్న దేవినేని ఉమ ఎప్పుడూ పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా ఉంటారు. ఈ సంఘటనతో పలువురు పార్టీ నేతలు ఆయనను పరామర్శిస్తున్నారు. ఆయన అభిమానులు, అనుచరులు, ఇతరత్రా నేతలు అయన ఇంటి దగ్గరకు చేరుకుంటున్నారు.
సమాచారం అందుకున్న టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు హుటాహుటిన దేవినేని ఇంటికి వెళ్లి పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. శ్రీమన్నారాయణ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియచేసారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ