కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రప్రభుత్వం మే 17 వరకు పొడిగించిన లాక్డౌన్ లో పలు ఆర్ధిక వ్యవహారాలకు, కీలక రంగాలకు సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మద్యం ఉత్పత్తికి అనుమతులు ఇచ్చింది. ప్రభుత్వ అనుమతి లభించడంతో మే 3, ఆదివారం నుంచి రాష్ట్రంలో 20 డిస్టలరీలు ఉత్పత్తి ప్రారంభించనున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగానే మద్యం ఉత్పత్తికి ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది.
మద్యం తయారీ చేసే కంపెనీలను ముందుగా పూర్తిస్థాయిలో శానిజైట్ చేయాలని పేర్కొన్నారు. అలాగే మద్యం తయారీలో పాల్గొనే కార్మికులు సామాజిక దూరం పాటించాలని సూచించారు. మద్యం ఉత్పత్తి కంపెనీల్లో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు వేర్వేరుగా ఉండాలని, మరియు ఆ ప్రాంతాల్లో గుట్కా, సిగరేట్ నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మరో వైపు కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ కంపెనీల్లో పనిచేసే కార్మికులు లిఫ్టులు ఉపయోగించవద్దని ఆదేశాలు ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu