గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో గౌస్ అనే యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన రాష్ట్రంలో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ముందుగా లాక్డౌన్ నేపథ్యంలో బయటకు వచ్చిన గౌస్ను ఆపే క్రమంలో జరిగిన ఘటనలో పోలీసులపై విమర్శలు రావడంతో ఈ ఘటనపై విచారణ జరిపిస్తున్నామని, అతన్ని అడ్డుకున్న ఎస్సై రమేశ్బాబును సస్పెండ్ చేసినట్లు ఐజీ ప్రభాకర్రావు వెల్లడించారు. అనంతరం ఈ ఘటనపై మంగళవారం నాడు ఏపీ పోలీస్ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి వివరణ ఇచ్చారు.
“గుంటూరు గ్రామీణ జిల్లాలో జరిగిన దురదృష్టకర సంఘటనలో షేక్ మహ్మద్ గౌస్ మరణించారు. పోలీసులపై ఆరోపణలు కూడా చేశారు. చెక్ పోస్ట్ వద్ద మృతుడిని ఆపిన సత్తెనపల్లి టౌన్ పోలీస్స్టేషన్ కు చెందిన ఎస్ఐ డి.రమేష్ ను సస్పెండ్ చేశాం. మరణించిన వ్యక్తి బాల్యం నుండి పుట్టుకతో వచ్చే గుండె జబ్బుతో బాధపడుతున్నారు. అతనికి ఆపరేషన్ చేయబడింది మరియు స్టెంట్లు అమర్చారు. శరీరంపై ఎటువంటి గాయాలు లేవని పంచనామాలో గుర్తించారు. విచారణ/ న్యాయవిచారణ ను సబ్ డివిజన్ మేజిస్ట్రేట్ నిర్వహించారు. డాక్టర్లు నిర్వహించిన పోస్ట్ మార్టం పక్రియను వీడియో ద్వారా చిత్రీకరించారు. మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదులో పోలీసులపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు. కేసు నమోదు చేయబడింది మరియు దర్యాప్తు చేయబడుతోంది. సమాంతరంగా డిపార్ట్మెంటల్ విచారణకు కూడా డీజీపీ ఆదేశించారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం అన్ని విధానాలు పాటిస్తున్నాం. ఈ దురదృష్టకర సంఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తున్నామని” ఏపీ పోలీస్ అధికారిక ట్విట్టర్ లో పేర్కొన్నారు.
1/3: In an unfortunate incident in Guntur Rural district, Shaik Mohammed Ghouse died. Allegations were made against police. Pending enquiry SI D.Ramesh of Sattenapalli Town PS who had stopped the deceased at the Checkpost has been suspended..
— AP Police (@APPOLICE100) April 20, 2020
2/3: deceased suffered from cyanotic congenital heart disease since childhood & was operated & implanted with stents. No physical injuries have been found on the body. Enquiry/Inquest has been conducted by Sub Div Magistrate. Post Mortem conducted by team of docs & videographed..
— AP Police (@APPOLICE100) April 20, 2020
3/3: the written complaint by father mentions no allegations against police. Case has been registered & is being investigated. Parallely DGP has ordered departmental enquiry also. All procedures as per SC guidelines are being followed. The unfortunate demise is regretted.
— AP Police (@APPOLICE100) April 20, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu