ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య 502 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఏప్రిల్ 14, మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఏప్రిల్ 15, బుధవారం ఉదయం వరకు జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో 8, కర్నూల్ లో 6, గుంటూరులో 4, కృష్ణ జిల్లాలో 1 కేసు తో కలిపి 19 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 502 కి పెరిగింది ఇప్పటి వరకు రాష్ట్రంలో ఈ వైరస్ వలన 11 మంది (అనంతపూర్ జిల్లాలో 2, కృష్ణ 3, గుంటూరు 4, కర్నూల్ 1, నెల్లూరు 1) మరణించగా, 16 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయినట్లు తెలిపారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 475 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం ఒక్కరోజే కొత్తగా 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 644కి చేరిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కొత్తగా ఏడుగురు డిశ్చార్జ్ కావడంతో మొత్తం డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 110కి చేరింది. ఈ వైరస్ వలన ఇప్పటివరకు 18 మంది మరణించినట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 516 మంది చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.
#CovidUpdates: రాష్ట్రంలో నిన్న సాయంత్రం 5 నుంచి ఈరోజు ఉదయం వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో పశ్చిమ గోదావరి లో 8, కర్నూల్ లో 6, గుంటూరు లో 4, కృష్ణ జిల్లా లో 1 కేసు నమోదయ్యాయి.
కొత్తగా నమోదైన 19 కేసుల తో కలిపి రాష్ట్రం లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 502 కి పెరిగింది pic.twitter.com/A9svmhpq4h— ArogyaAndhra (@ArogyaAndhra) April 15, 2020
Media bulletin with district wise break up on status of positive cases of #COVID19 in Telangana (Dated: 14.04.2020) pic.twitter.com/iv6WAm2JVD
— Minister for Health Telangana State (@TelanganaHealth) April 14, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu