దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక రాష్ట్రపతి భవన్ లో తోలి కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. రాష్ట్రపతి భవన్ వద్ద పనిచేసే పారిశుధ్య కార్మికుడి బంధువుకు కరోనావైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు సమాచారం. ఆమె రాష్ట్రపతి భవన్ లో ఉద్యోగి కానప్పటికీ వారి కుటుంబంతో పాటు అక్కడే నివసిస్తుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు రాష్ట్రపతి భవన్లో పనిచేస్తున్న సుమారు 100 మందిని క్వారంటైన్ తరలించినట్టుగా తెలిపారు.
అలాగే రాష్ట్రపతి భవన్ గేట్ నంబర్ 70 వద్ద పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న125 మంది సిబ్బంది కుటుంబాలను కూడా స్వీయ నిర్బంధంలోకి పంపినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,081కి పెరిగింది. ఇప్పటికే 431 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, 47 మంది మరణించారు. దేశంలో మహారాష్ట్ర తర్వాత ఢిల్లీ లోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu