ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 15 తేదీవ నుంచి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 15, గురువారం ఉదయం 9 గంటలకు శాసన సభ, 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుక్రవారం నాడు నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా సమావేశాలకు సంబంధించిన ఎజెండా, సభ నిర్వహణ రోజులను అసెంబ్లీ వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశంలో ఖరారు చేయనున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అలాగే అధికారంలోకి వచ్చినప్పటి చేపట్టిన సంక్షేమ పథకాలు, ఇతర రాష్ట్ర సంబంధిత అంశాలపై కీలకంగా చర్చించనున్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY