తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 128 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో సెప్టెంబర్ 9, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,35,747 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ లో 54, రంగారెడ్డిలో 11, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 6, నారాయణపేట్ లో 6, మహబూబ్ నగర్ లో 5, మెదక్ లో 5 నమోదయ్యాయి.
రాష్ట్రంలో ప్రస్తుతం 933 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే కోవిడ్ నుంచి మరో 177 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 8,30,703 కి చేరింది. రాష్ట్రంలో కోవిడ్ రికవరీ రేటు 99.40 శాతంగా, మరణాల రేటు 0.49 శాతంగా ఉంది. కోవిడ్ వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 4,111 గా ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY