ఏపీ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు కొనసాగుతున్నాయి. మంగళవారం సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. కాగా ప్రభుత్వం నేడు సభలో రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది. మూడోరోజు సోమవారం మూడు కీలక బిల్లులకు ఆమోద తెలుపగా, శాసనమండలిలో నాలుగు బిల్లులను ఆమోదించారు. ఇదే క్రమంలో మంగళవారం శాసనసభలో మరో ఏడు బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. దీనిలో భాగంగా విద్య, వైద్య రంగాల్లో నాడు-నేడుపై అసెంబ్లీలో చర్చ కొనసాగనుంది. అలాగే అసెంబ్లీలో నేడు మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వెలుగుచూసినట్లుగా అధికార పక్షం ఆరోపిస్తున్న పెగాసస్ స్పై వేర్ అంశంపై సభలో నేడు కీలక చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది. స్పీకర్ తమ్మినేని సీతారాం దీనిపై ఇప్పటికే భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో హౌస్ కమిటీని నియమించడం తెలిసిందే. ఈ కమిటీ రూపొందించిన నివేదిక మంగళవారం ముందుకు రానుంది. 85 పేజీల నివేదికను సభ ముందు పెట్టనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY