గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెఛ్ఎంసీ) పాలకమండలి సర్వసభ్య సమావేశం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన ఈ నాలుగవ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పెండింగ్ లో ఉన్న సమస్యల సహా పలు అంశాలపై చర్చించనున్నారు. అయితే 5 నెలల తర్వాత కౌన్సిల్ సమావేశం జరుగుతుండడంతో ప్రతిపక్ష బీజేపీ కార్పొరేటర్లు నగర సమస్యలు, బిల్లుల చెల్లింపులపై తమ గళాన్ని వినిపిచేందుకు సిద్ధమయ్యారు. అలాగే జీహెఛ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి వచ్చిన 43మంది బీజేపీ కార్పొరేటర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి హాజరయ్యారు. కొందరు ఎమ్మెల్యే రాజాసింగ్ ను విడుదల చేయాలని ప్లకార్డులు పట్టుకుని వచ్చారు. ఈ సమావేశం దృష్ట్యా భారీగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ కౌన్సిల్ సమావేశంలో ఇటీవలే స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపిన 26 ప్రతిపాదనలను ఆమోదించి, ప్రభుత్వ అనుమతి కోసం పంపించాలని అధికార పక్షం భావిస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY