ఏడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈరోజు పలు శాఖల (సాంఘిక, గిరిజన, బీసీ, మహిళ, శిశు, మైనారిటీ సంక్షేమం, గృహనిర్మాణ శాఖ) పద్దులపై సభలో చర్చ జరుగనుంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటినుంచి ఆందోళన తెలుపుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు ఈరోజు కూడా తమ నిరసనను కొనసాగించారు. సభ మొదలవగానే టీడీపీ సభ్యులు జంగారెడ్డిగూడెం ఘటనపై చర్చించాలని కోరుతూ ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించి తమ నిరసన తెలిపారు. స్పీకర్ అంగీకరించక పోవటంతో స్పీకర్ పోడియం దగ్గర నిరసనకు దిగారు.
జంగారెడ్డిగూడెం మరణాలపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. దీంతో సభలో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే సభలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల ఆందోళన నేపథ్యంలో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. అనంతరం సభను కొనసాగించిన స్పీకర్.. అసెంబ్లీ కార్యకలాపాలకు అడ్డు తగులుతుండటంతో 10 మంది టీడీపీ సభ్యులను సభ నుంచి ఒకరోజు సస్పెన్షన్ చేశారు. టీడీపీ సభ్యులపై నిన్న కూడా ఒకరోజు సస్పెన్షన్ విధించిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ