ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సెప్టెంబర్ 4న జరగనుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో కేబినెట్ భేటీ కానుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సిన అంశాలకు సంబంధించినా ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అన్ని శాఖల అధికారులుకు చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశాలను జారీ చేసారు. ఈ మంత్రివర్గ సమావేశాలలో పలు కీలకాంశాలపై నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వ సంక్షేమ పధకాల అమలుపై ప్రభుత్వం చర్చించి వాటికీ ఆమోదం తెలుపనున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై నియమించిన కమిటీ నివేదికలు, పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ అంశం, గతకొన్ని రోజులుగా అమరావతి పై జరుగుతున్న ప్రచారాల గురించి ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
[subscribe]
[youtube_video videoid=8rAvhkcVQVA]