పోలవరం నీటి పారుదల ప్రాజెక్టు (పీఐపీ)కి సంబంధించిన వివిధ అంశాలపై పరిశీలన జరిపేందుకు కేంద్ర జల సంఘం మే 12న పోలవరం ప్రాజెక్టును సందర్శించనుంది. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టులో అత్యంత ముఖ్యమైన డయాఫ్రం వాల్ మరమ్మత్తు పనులను పరిశీలించేందుకు 12న కేంద్ర జలసంఘం, 17న డ్యాం డిజైన్ రివ్యూ ప్యానల్ (డీడీఆర్పీ) బృందాలు రానున్నాయి. అలాగే సెంట్రల్ వాటర్ కమిషన్ (సిడబ్ల్యుసి) అధికారుల బృందం ప్రాజెక్ట్ సైట్ను సందర్శించి, ఎర్త్-కమ్-రాక్ ఫిల్ (ECRF) డ్యామ్, స్పిల్వే, స్పిల్ ఛానల్ మరియు ఇతర డిజైన్ భాగాలను కూడా సమీక్షించే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న డిజైన్ల క్లియరెన్స్పై కూడా అధికారులు చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర జల వనరుల శాఖ చేపట్టిన డయాఫ్రం వాల్ మరమ్మత్తు పనులు పూర్తి స్థాయిలో సమీక్షించేందుకు సీనియర్ అధికారి షరీఫ్ ఆధ్వర్యంలో జలసంఘం, ఏబీ పాండ్యా నేతృత్వంలో డీడీఆర్పీ బృందాలు రాష్ట్రానికి వస్తున్నాయి. పర్యటన అనంతరం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ప్రాజెక్టుకి సంబంధించి నివేదిక ఇవ్వనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ