ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ముందుగా సోమవారం ఉదయం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను సీఎం ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు పెండింగు బిల్లులు మంజూరు, నిర్వాసితులకు పునరావాస కల్పన, విభజన అంశాలు పరిష్కారం, రాష్ట్రంలో నిర్మిస్తున్న ఇళ్ల కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు నిధుల సాయం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, మెడికల్ కాలేజీలకు అనుమతులు, సాయం, రేషన్ బియ్యం అంశం, భోగాపురం ఎయిర్ పోర్ట్ క్లియరెన్స్ వంటి అంశాలపై మరోసారి ప్రధానికి సీఎం వివరించినట్టు సమాచారం.
మరోవైపు ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ దన్కర్ లను కూడా సీఎం వైఎస్ జగన్ మర్యాదపూర్వకంగా కలవనున్నారు. అదేవిధంగా కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ సహా పలువురు కేంద్రమంత్రులను కూడా సీఎం కలిసే అవకాశం ఉంది. ఈ భేటీల్లో సీఎం వెంట వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి, పలువురు ఎంపీలు ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY