తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 252 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆగస్టు 21, బుధవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 8,31,874కి చేరింది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ పరిధిలో 143, రంగారెడ్డిలో 16, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 14, మహబూబ్ నగర్ లో 8, సంగారెడ్డిలో 7, జగిత్యాలలో 6, మెదక్ లో 6, నిజామాబాదులో 6, సూర్యాపేటలో 6, హనుమకొండలో 6 నమోదయ్యాయి. ఇక కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు (ఆగస్టు 21, సాయంత్రం 5.30 గంటల వరకు):
- రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం కరోనా పరీక్షలు : 3,71,77,941
- ఆగస్టు 21న నిర్వహించిన మొత్తం కరోనా పరీక్షలు : 17,029
- కొత్తగా నమోదైన కేసులు : 252
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 8,31,874
- కొత్తగా కోలుకున్నవారి సంఖ్య: 291
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 8,25,091
- కరోనా రికవరీ రేటు: 99.18%
- యాక్టీవ్ కేసులు : 2,672
- కొత్తగా నమోదైన మరణాలు : 0
- నమోదైన మొత్తం మరణాల సంఖ్య : 4,111
- కరోనా మరణాల రేటు: 0.49%
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY