భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన బుధవారం అధికారిక ట్విట్టర్ ద్వారా సీఎం వైఎస్ జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా.. సీఎం జగన్ ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు పొందాలని కోరుకుంటున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అలాగే ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా ట్విటర్ ద్వారా సీఎం జగన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కాగా సీఎం జగన్ నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం విశేషం. ఇక ఇదిలా ఉండగా సీఎం జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు రాష్ట్రవ్యాప్తంగా కేక్లు కట్ చేయడంతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇక సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఢిల్లీలోని ఏపీ భవన్లో వైసీపీ ఎంపీలు కేక్ కట్ చేశారు.
Best wishes to Andhra Pradesh CM Shri @ysjagan Garu on his birthday. May he be blessed with a long and healthy life.
— Narendra Modi (@narendramodi) December 21, 2022
Hearty Greetings to Hon’ble Chief Minister of Andhra Pradesh Thiru. @ysjagan on his 50th Birthday.
Wishing you peace, good health and happiness always on this special day.
— M.K.Stalin (@mkstalin) December 21, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ