తెలంగాణలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు సోమవారంతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న ఈ ముగింపు వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరవనున్నారు. దీంతో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు స్టేడియం పరిసరాల్లో ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గం.ల వరకు ఆంక్షలు విధించారు. ఈ సందర్భంగా వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే..
- చాపెల్రోడ్, నాంపల్లి వైపు వచ్చే వాహనాలు పోలీసు కంట్రోల్ రూమ్ మీదుగా అనుమతి.
- గన్ఫౌండ్రి ఎస్బీఐ నుంచి ప్రెస్క్లబ్, బషీర్బాగ్ ఫ్లై-ఓవర్ వైపు నుంచి వచ్చే వాహనాలు చాపెల్ రోడ్డు వైపు అనుమతి.
- రవీంద్రభారతి, హిల్ ఫోర్ట్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలు నాంపల్లి వైపు మళ్లింపు.
- నారాయణగూడ నుంచి వచ్చే వాహనాలు హిమాయత్ నగర్ వై జంక్షన్ వైపు అనుమతి.
- కింగ్కోఠి, బొగ్గుల కుంట నుంచి బషీరాబాగ్, భారతీయ విద్యాభవన్ మీదుగా వెళ్లే వాహనాలు తాజ్మహల్, ఇడెన్ గార్డెన్ మీదుగా అనుమతి.
- బషీర్బాగ్ నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ వైపు వచ్చే వాహనాలు లిబర్టీ మీదుగా అనుమతి.
- హిమాయత్నగర్ వై-జంక్షన్ నుంచి బషీర్బాగ్ వైపు వచ్చే వాహనాలు హిమాయత్నగర్ వై-జంక్షన్ వైపు మళ్లింపు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY