అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం.. ‘మే’డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్మికులకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు సీఎం జగన్ తన ట్విట్టర్ ఖాతాలో కార్మికులనుద్దేశించి.. ‘‘శ్రామిక శక్తిని మించిన ఆస్తి లేదు. శ్రామికుల భాగస్వామ్యం లేని అభివృద్ధి లేదు. రక్తాన్ని స్వేదంగా మార్చి అవరోధాలను అభివృద్ధి మెట్లుగా మలిచే కార్మిక శక్తికి వందనం. కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు.
శ్రామిక శక్తిని మించిన ఆస్తి లేదు. శ్రామికుల భాగస్వామ్యం లేని అభివృద్ధి లేదు. రక్తాన్ని స్వేదంగా మార్చి అవరోధాలను అభివృద్ధి మెట్లుగా మలిచే కార్మిక శక్తికి వందనం. కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 1, 2022
అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వేడుకలలో పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర ప్రభుత్వం కార్మికులతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక వినూత్న పథకాలను ప్రవేశపెట్టిందని, సీఎం వైఎస్ జగన్ కోట్లాది మంది ప్రజల మనసు దోచుకున్నారని, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్నారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ