రాష్ట్ర ప్రజలకు శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

AP CM YS Jagan Mohan Reddy Extends Wishes on Shri Krishna Janmashtami Festival, YS Jagan Mohan Reddy Extends Wishes on Shri Krishna Janmashtami Festival, Wishes on Shri Krishna Janmashtami Festival, Greetings on Shri Krishna Janmashtami Festival, Shri Krishna Janmashtami Festival, Janmashtami 2022 Celebrations, Shri Krishna Janmashtami 2022, 2022 Shri Krishna Janmashtami, Gokulashtami, Krishna Janmashtami News, Krishna Janmashtami Latest News And Updates, Krishna JanmashtamiLive Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ‘శ్రీ కృష్ణ జన్మాష్టమి’ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకృష్ణుడు అష్టమి తిథి నాడు రోహిణి నక్షత్రంలో జన్మించాడని, ఆ పర్వదినం నేడే అని సీఎం జగన్ గుర్తు చేశారు. మానవాళికి కర్తవ్యబోధ చేసిన భగవద్గీతను అందించిన శ్రీ కృష్ణ భగవానుడి జన్మదినాన్ని ప్రజలందరూ ఆనందంగా జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ప్రజలనుద్దేశించి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పోస్ట్ పెట్టారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా భగవద్గీతలో శ్రీ కృష్ణ పరమాత్ముడు బోధించిన సందేశాన్ని ప్రస్తావించారు. ‘కర్తవ్యదీక్షను జీవనసూత్రంగా తెలిపిన గీతాచార్యుడు శ్రీకృష్ణుడు. ప్రేమ, స్నేహం, ధర్మాచరణ ఆయన బోధించిన పాఠాలు. రాష్ట్ర ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − 2 =