ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 28న ప్యారిస్ పర్యటనకు వెళ్లనున్నారు. అయితే ఇది అధికారిక పర్యటన కాదు, కొన్ని వ్యక్తిగత పనుల నిమిత్తం ముఖ్యమంత్రి ప్యారిస్ పర్యటనకు వెళుతున్నారు. కాగా ఆయన పెద్ద కుమార్తె హర్షా రెడ్డి ప్యారిస్లో ప్రముఖ కళాశాల ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. కాగా ఆమె స్కూల్ ఎడ్యుకేషన్ను బెంగళూరులో పూర్తి చేసిన అనంతరం గ్రాడ్యుయేషన్ కోసం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్లో చేరారు. ఆ తర్వాత మాస్టర్స్ చేయడం కోసం ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ డిగ్రీ చదవడం కోసం హర్షా రెడ్డి 2020 ఆగష్టులో పారిస్ వెళ్లారు.
ఈ క్రమంలో జూలై 2వ తేదీన ప్యారిస్ లోని కళాశాలలో స్నాతకోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసమే సీఎం జగన్ ప్యారిస్ వెళ్లనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. కుమార్తె కాన్వోకేషన్ కార్యక్రమానికి హాజరయిన అనంతరం సీఎం జగన్ రాష్ట్రానికి తిరిగి రానున్నారు. అయితే దీనికి ముందుగా ఈ పర్యటనకు అనుమతివ్వాల్సిందిగా ఆయన సిబిఐ కోర్టును కోరారు. దేశం విడిచి వెళ్లరాదన్న సీబీఐ కోర్టు ఆదేశాలను సడలించాలని, కుమార్తె కళాశాల స్నాతకోత్సవానికి హాజరవడానికి వీలుగా అనుమతివ్వాలంటూ కోర్టును అభ్యర్ధించారు. దీని కోసం జూన్ 28 నుంచి ఒక వారం రోజులు పాటు ప్యారిస్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ కోర్టును కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ