దేశవ్యాప్త ‘అగ్నిపథ్’ ఆందోళనలలో భాగంగా శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న పరిణామాలు దురదృష్టకరమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా విచారం వ్యక్తంచేశారు. అగ్నిపథ్ పథకం ద్వారా ఆర్మీ రిక్రూట్మెంట్ విధానంపై నిరసన తెలిపే కార్యక్రమం హింసాత్మకంగా మారడం బాధాకరమని తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసుల కాల్పుల్లో ఒక యువకుడు మృతిచెండంపై స్పందిస్తూ.. యువకుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అని వెల్లడించారు. అలాగే ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలని పవన్ కళ్యాణ్ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన దురదృష్టకరం – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/5cl09qWOGu
— JanaSena Party (@JanaSenaParty) June 17, 2022
కాగా భారత రక్షణ రంగంలో కీలకమైన సైనికులు, ఎయిర్మెన్లు మరియు నావికుల విభాగాలలో కొత్తగా కొందరిని రిక్రూట్ చేసుకోవడానికి పాన్-ఇండియా మెరిట్ ఆధారిత పథకం అయిన ‘అగ్నిపథ్’ పథకాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు ఈ పథకం కింద, శిక్షణా కాలంతో సహా నాలుగు సంవత్సరాల పాటు “అగ్నివీర్” గా సాయుధ దళాలలో పనిచేసే అవకాశం యువకులకు అందించబడుతుందని తెలిపింది. అయితే ఇది పూర్తికాలానికి కాకుండా కేవలం నాలుగు సంవత్సరాలకే పరిమితం చేయడం పట్ల దేశవ్యాప్తంగా ఆర్మీ ఉద్యోగార్థులు తమ నిరసనను తెలుపుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ