డిసెంబర్ 17న కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం జగన్‌ విందు

AP Breaking News, AP CM YS Jagan Dinner, AP CM YS Jagan Host Dinner To Collectors MLAs and SPs, Ap Cm Ys Jagan Latest News, Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Mango News Telugu, YSRCP Latest News
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 17, మంగళవారం నాడు ముగియనున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విందు ఏర్పాటు చేయనున్నారు. ఈ విందుకు రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లను ఆహ్వానించబోతున్నారు. విజయవాడలోని బరం పార్క్‌లో 17వ తేదీ సాయంత్రం 6.30కి ఈ విందు కార్యక్రమం జరుగుతుందని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల మధ్య సమన్వయం పెంచేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ విందు భేటీలో జిల్లాలవారీగా ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, జిల్లాల్లో సమస్యలు, మహిళల భద్రత, గ్రామ సచివాలయాలు, స్పందన కార్యక్రమంతో పాటు పలు అంశాలపై సీఎం వైఎస్ జగన్ చర్చించబోతున్నట్టు తెలిపారు.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + five =