ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 17, మంగళవారం నాడు ముగియనున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విందు ఏర్పాటు చేయనున్నారు. ఈ విందుకు రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లను ఆహ్వానించబోతున్నారు. విజయవాడలోని బరం పార్క్లో 17వ తేదీ సాయంత్రం 6.30కి ఈ విందు కార్యక్రమం జరుగుతుందని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల మధ్య సమన్వయం పెంచేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ విందు భేటీలో జిల్లాలవారీగా ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, జిల్లాల్లో సమస్యలు, మహిళల భద్రత, గ్రామ సచివాలయాలు, స్పందన కార్యక్రమంతో పాటు పలు అంశాలపై సీఎం వైఎస్ జగన్ చర్చించబోతున్నట్టు తెలిపారు.
[subscribe]
AP CM YS Jagan Huge Appreciation For Telangana CM KCR Again | #DishaAct | AP Assembly Session 2019
06:50
AP CM YS Jagan Explanation Over Severe Punishments In Disha Act At Assembly Session | Mango News
06:36
Botsa Satyanarayana Open Challenge To TDP Leaders Over AP Housing Scheme | #APAssemblySession2019
06:32
Botsa Satyanarayana Challenges TDP Leaders Over Reverse Tendering In Housing Scheme |#APAssembly2019
08:09