జూలై 1, బుధవారం ఉదయం 9:35 గంటలకు విజయవాడలోని బెంజి సర్కిల్ వద్ద 108,104 అత్యాధునిక అంబులెన్స్లను ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో అత్యవసర వైద్య సేవల నిమిత్తం ఉపయోగించే 108, 104 సర్వీసుల్లో ప్రమాణాలు మెరుగుపరచి, సాంకేతిక పరిజ్ఞానం, వసతులు కల్పించి సమూల మార్పులతో తీర్చిదిద్దారు. అనారోగ్యానికి గురైన వారిని ఆస్పత్రికి తరలించే సమయంలో కూడా పరిస్థితులకనుగుణంగా చికిత్స అందించేలా అంబులెన్స్ లలో మార్పులు చేశారు. ఈ అంబులెన్స్ ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి బెంజ్ సర్కిల్లో చేస్తున్న ఏర్పాట్లపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఈ రోజు సమీక్ష నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ