ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కరోనా వైరస్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా నియంత్రణ కోసం వివిధ ఫార్మా కంపెనీలు వాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తయారీకి సంబంధించి భారత్ బయోటెక్ ఇండియా లిమిటెడ్ కీలక దశకు చేరుకుంది. “కోవ్యాక్సిన్” పేరుతో భారత్ బయోటెక్, ఐసీఎంఆర్, ఎన్ఐవీ సంయుక్తంగా తయారుచేస్తున్న ఈ వ్యాక్సిన్ ను మానవులపై ఫేజ్-1, ఫేజ్-2 ప్రయోగాలు చేసేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. జూలై నుంచి దేశం అంతటా ఈ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నట్లు భారత్ బయోటెక్ కంపెనీ సోమవారం నాడు వెల్లడించింది. కరోనా కట్టడికి దేశంలో తయారవుతున్న తోలి ఔషధం ఇదే కావడం విశేషం.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ