తెలంగాణలో రోజురోజుకి కరోనా వైరస్ ప్రభావం మరింతగా పెరుగుతుంది. ముఖ్యంగా జీహెఛ్ఎంసీ పరిధిలో ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 945 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 30, మంగళవారం నాటికీ మొత్తం కేసుల సంఖ్య 16,339 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. మంగళవారం నాడు 3457 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన మరో ఏడుగురు మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 260 కి పెరిగినట్టు తెలిపారు. ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 1712 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 7294 కి చేరింది. ప్రస్తుతం 8785 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu