ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 10 న 12 కార్పోరేషన్స్, 75 మునిసిపాలిటీలు/నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మున్సిపల్ ఎన్నికల కోసం ప్రచారం చేపట్టాలని నిర్ణయించారు. మార్చి 4, గురువారం నుంచి మార్చి 8, సోమవారం వరకు 5 రోజుల పాటుగా పలు జల్లాల్లో చంద్రబాబు పర్యటించి మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
మార్చి 4న కర్నూలు జిల్లాలో, 5న చిత్తూరు జిల్లాలో, 6న విశాఖపట్నం జిల్లాలో, 7న విజయవాడ నగరంలో, 8న గుంటూరు జిల్లాలో నిర్వహించే ప్రచార సభల్లో పాల్గొననున్నారు. అలాగే ఆయా జిల్లాల్లో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో రోడ్షోలు నిర్వహించనున్నారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికలకు 10 వాగ్ధానాలతో కూడిన మేనిఫెస్టోను టీడీపీ ఇటీవలే విడుదల చేసింది. ప్రచారం సందర్భంగా ఈ మేనిఫెస్టోలోని అంశాలను చంద్రబాబు ప్రజలకు వివరించనున్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ