ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతుండడంతో గత కొన్ని రోజులుగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 10128 పాజిటివ్ కేసులు, 77 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో ఆగస్టు 5, బుధవారం ఉదయం 10 గంటల వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 186461 కు, కరోనా వలన మరణించిన వారి సంఖ్య 1681 కి చేరింది. మరో 8729 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారు. గత 24 గంటల్లో 60576 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు.
కరోనా వలన గత 24 గంటల్లోనే గుంటూరులో పదహారు మంది, విశాఖపట్నంలో పన్నెండు మంది, శ్రీకాకుళంలో పదిమంది, చిత్తూరులో ఎనిమిది మంది, తూర్పుగోదావరిలో ఏడుగురు, కృష్ణాలో ఐదుగురు, నెల్లూరులో నలుగురు, కర్నూల్ లో ముగ్గురు, విజయనగరంలో ముగ్గురు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, ప్రకాశంలో ఇద్దరు, అనంతపూర్ లో ఇద్దరు, కడపలో ఇద్దరు మరణించడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 1681 కి చేరింది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (ఆగస్టు 5, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షలు: 22,35,646
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 186461
- కొత్తగా నమోదైనా కేసులు : 10128
- నమోదైన మరణాలు : 77
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 104354
- యాక్టీవ్ కేసులు : 80426
- మొత్తం మరణాల సంఖ్య : 1681
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu