ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మరోసారి పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. కొత్తగా 1288 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఏప్రిల్ 2, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,04,548 కు చేరింది. కొత్తగా గుంటూరు జిల్లాలో అత్యధికంగా 311, చిత్తూరులో 225, విశాఖపట్నంలో 191, కృష్ణాలో 164 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మరో 610 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయినట్టు తెలిపారు. ఇక కరోనా వలన అనంతపూర్, చిత్తూర్, గుంటూరు, ప్రకాశం మరియు విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 7225 కి పెరిగింది. గత 24 గంటల్లో 31,116 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, మొత్తం పరీక్షల సంఖ్య 1,51,46,104 కు చేరుకుంది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (ఏప్రిల్ 2, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 9,04,548
- కొత్తగా నమోదైన కేసులు : 1288
- కొత్తగా నమోదైన మరణాలు : 5
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 8,88,508
- యాక్టీవ్ కేసులు : 8815
- మొత్తం మరణాల సంఖ్య : 7225
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ