ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 1728 కరోనా పాజిటివ్ కేసులు, 9 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో నవంబర్ 12, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,49,705 కు చేరగా, కరోనా వలన మరణించిన వారి సంఖ్య 6837 కి పెరిగింది. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారే అధికంగా ఉన్నారు. గత 24 గంటల్లో 1777 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు.
కాగా గడిచిన 24 గంటల్లో 77,148 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించారు. ఇక కరోనా వలన చిత్తూరులో ముగ్గురు, కృష్ణాలో ఇద్దరు, అనంతపూర్ లో ఒకరు, గుంటూరులో ఒకరు, పశ్చిమగోదావరిలో ఒకరు మరియు తూర్పుగోదావరిలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 6837 కి చేరింది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (నవంబర్ 12, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షలు: 89,40,488
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 8,49,705
- కొత్తగా నమోదైనా కేసులు : 1728
- నమోదైన మరణాలు : 9
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 8,22,011
- యాక్టీవ్ కేసులు : 20857
- మొత్తం మరణాల సంఖ్య : 6837
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ