ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ 10, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,46,245 కు చేరుకుంది. గత 24 గంటల్లో 67910 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా, 1886 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. కొత్తగా తూర్పుగోదావరి జిల్లాలో 227, కర్నూల్ జిల్లాలో 33, కృష్ణా జిల్లాలో 269, కడప జిల్లాలో 67, గుంటూరు జిల్లాలో 275, చిత్తూరు జిల్లాలో 291, అనంతపూర్ జిల్లాలో 60, నెల్లూరు జిల్లాలో 79, ప్రకాశం జిల్లాలో 111, శ్రీకాకుళంలో 33, విశాఖపట్నంలో 97, విజయనగరంలో 62, పశ్చిమగోదావరిలో 282 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో మరో 12 మరణాలు నమోదవడంతో మొత్తం మరణాల సంఖ్య 6814 కి పెరిగింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 2151 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 8,18,473 కు చేరింది. అలాగే ప్రస్తుతం 20958 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక నవంబర్ 10 నాటికీ ఏపీలో మొత్తం 87,92,935 కరోనా పరీక్షలను నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ