భారత్ లో కరోనా వైరస్ ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. కొత్తగా దేశవ్యాప్తంగా 38073 పాజిటివ్ కేసులు, 448 మరణాలు నమోదయ్యాయి. దీంతో నవంబర్ 10, మంగళవారం ఉదయానికి దేశంలో కేసుల సంఖ్య 85,91,730 కు, మరణాల సంఖ్య 1,27,059 కి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు గత 24 గంటల్లో 42,033 మంది కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 79,59,406 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 92.64 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.48 శాతంగా నమోదైంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (నవంబర్ 10, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు : 85,91,730
- కొత్తగా నమోదైన కేసులు [నవంబర్ 9–నవంబర్ 10 (8AM-8AM)] : 38073
- నమోదైన మరణాలు : 448
- డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 79,59,406
- యాక్టీవ్ కేసులు : 5,05,265
- మొత్తం మరణాల సంఖ్య : 1,27,059
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ