ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంగళవారం కడప జిల్లాలో వరద తాకిడికి గురైన ప్రాంతాలను చంద్రబాబు పరిశీలిస్తున్నారు. ముందుగా కడప విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు టీడీపీ పార్టీ శ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం తొగురుపేట, మందపల్లి, పులపత్తురు, గుండ్లురు గ్రామాల్లో పర్యటించి వరద బాధితులతో మాట్లాడనున్నారు. ఈ రోజు పర్యటన కడపలో కాగా, బుధవారం చిత్తూరు జిల్లాలో, గురువారం నెల్లూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ