ఏపీలో గత 24 గంటల్లో 81740 కరోనా పరీక్షలు, 2345 మందికి పాజిటివ్ గా నిర్ధారణ

Andhra Pradesh, AP Corona Cases, AP Corona Positive Cases, AP Coronavirus, AP COVID 19 Cases, AP Total Positive Cases, Corona Positive Cases, Coronavirus, Coronavirus state-wise count in India, COVID-19, State wise Corona Positive Cases, State-wise Corona Positive Cases List in India, telangana, Telangana Coronavirus, Telangana Coronavirus Death

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో జూలై 16, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,34,450 కు చేరుకుంది. గత 24 గంటల్లో 81,740 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా, 2345 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. కొత్తగా తూర్పుగోదావరి జిల్లాలో 508, కర్నూల్ జిల్లాలో 29, కృష్ణా జిల్లాలో 238, కడప జిల్లాలో 84, గుంటూరు జిల్లాలో 121, చిత్తూరు జిల్లాలో 332, అనంతపూర్ జిల్లాలో 52, నెల్లూరు జిల్లాలో 228, శ్రీకాకుళంలో 95, విశాఖపట్నంలో 150, పశ్చిమగోదావరిలో 229, ప్రకాశం జిల్లాలో 243, విజయనగరంలో 36 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో మరో 16 మరణాలు నమోదవడంతో మొత్తం మరణాల సంఖ్య 13097 కి పెరిగింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 3,001 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 18,96,499 కు చేరింది. అలాగే ప్రస్తుతం 24,854 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక జూలై 16 నాటికీ ఏపీలో మొత్తం 2,33,96,437 కరోనా పరీక్షలను నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 14 =