టీమ్ ఇండియా, శ్రీలంక జట్ల మధ్య జూలై 18, 20, 23 తేదీల్లో 3 వన్డేలు, జూలై 25, 27, 29 తేదీల్లో 3 టీ20ల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సిరీసుల్లో టీమ్ ఇండియాతో తలపడే 25 మంది ఆటగాళ్లతో కూడిన శ్రీలంక జట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు శుక్రవారం నాడు ప్రకటించింది. దసన్ షనకకు కెప్టెన్ బాధ్యతలు అప్పగించగా, ధనంజయ డిసిల్వ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇక ఈ బృందంలో కుసల్ జనిత్ పెరెరా గాయం కారణంగా ఆటలో పాల్గొనరని, బినురా ఫెర్నాండో గాయం కారణంగా వన్డే సిరీస్లో పాల్గొనరని పేర్కొన్నారు.
ఇటీవలే శ్రీలంక జట్టులో ఇద్దరు సహాయక సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ముందుగా జూలై 13 నుంచి ప్రారంభం కావాల్సిన వన్డే సిరీస్ ను జూలై 18 నుంచి ప్రారంభమయ్యేలా రీషెడ్యూల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో అన్ని మ్యాచ్లు కొలంబోలోని ఆర్ ప్రేమదాసా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోనే జరుగనున్నాయి.
టీమ్ ఇండియాతో వన్డే, టీ20 సిరీస్ లకు ఎంపికైన శ్రీలంక జట్టు:
- దసున్ షనక – కెప్టెన్
- ధనంజయ డిసిల్వ – వైస్ కెప్టెన్
- కుసల్ జనిత్ పెరెరా
- అవిష్కా ఫెర్నాండో
- భానుక రాజపక్సే
- పాతుమ్ నిస్సంకా
- చరిత్ అసలాంకా
- వనిండు హసరంగ
- అషేన్ బండారా
- మినోద్ భానుకా
- లాహిరు ఉదారా
- రమేష్ మెండిస్
- చమిక కరుణరత్నే
- బినురా ఫెర్నాండో
- దుష్మంత చమీరా
- లక్షన్ సందకన్
- అకిలా ధనంజయ
- శిరాన్ ఫెర్నాండో
- ధనంజయ లక్షన్
- ఇషాన్ జయరత్నే
- ప్రవీణ్ జయవిక్రమ
- అసితా ఫెర్నాండో
- కసున్ రజిత
- లాహిరు కుమార
- ఇసురు ఉదనా
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ