ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 7, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,40,730 కు, మరణాల సంఖ్య 6779 కు చేరుకుంది. గత 24 గంటల్లో (9AM-9AM) 80,082 కరోనా పరీక్షలు నిర్వహించగా 2367 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో కరోనా వలన మరో 11 మంది మరణించారు.
రాష్ట్రంలో కరోనా వలన కృష్ణా జిల్లాలో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, చిత్తూరులో ఇద్దరు, విశాఖపట్నంలో ఒకరు, తూర్పుగోదావరిలో ఒకరు, కడపలో ఒకరు మరియు పశ్చిమగోదావరిలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 6779 కి చేరింది. ఇక నమోదైన మొత్తం కేసుల్లో 8,12,517 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడగా, గత 24 గంటల్లో 2747 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో మరియు కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 21434 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ