ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 289 కరోనా పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో జనవరి 6, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,83,876 కు చేరగా, కరోనా వలన మరణించిన వారి సంఖ్య 7125 కి పెరిగింది. గత 24 గంటల్లో 428 మంది కరోనా నుంచి రికవరీ అయినట్టు తెలిపారు. ఇక కరోనా వలన కృష్ణా, ప్రకాశం మరియు విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. అలాగే ఒకేరోజులో 51,207 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, ఏపీలో మొత్తం పరీక్షల సంఖ్య 1,21,05,121 కు చేరుకుంది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (జనవరి 6, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 8,83,876
- కొత్తగా నమోదైనా కేసులు : 289
- నమోదైన మరణాలు : 3
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 8,73,855
- యాక్టీవ్ కేసులు : 2896
- మొత్తం మరణాల సంఖ్య : 7125
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ