ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 10776 కరోనా పాజిటివ్ కేసులు, 76 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో 3 జిల్లాల్లో 1000 కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరిలో 1405, నెల్లూరులో 1270, ప్రకాశంలో 1256 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ముఖ్యంగా తూర్పుగోదావరి, కర్నూల్, అనంతపూర్, పశ్చిమ గోదావరి, చిత్తూరు, విశాఖపట్నం, గుంటూరు జిల్లాలలో కేసులు ఎక్కువుగా నమోదయ్యాయి. దీంతో సెప్టెంబర్ 4, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,76,506 కు చేరింది.
ఏపీలో జిల్లాల వారీగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య:
- తూర్పుగోదావరి – 64305
- కర్నూల్ – 47573
- అనంతపూర్ – 43998
- పశ్చిమ గోదావరి – 40699
- చిత్తూరు – 40696
- విశాఖపట్నం – 39449
- గుంటూరు – 38791
- నెల్లూరు – 34933
- కడప – 29538
- ప్రకాశం – 26700
- శ్రీకాకుళం – 26565
- విజయనగరం – 22676
- కృష్ణా – 17688
- ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన వారు: 2461
- విదేశాల నుంచి వచ్చిన వారు: 434
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu