ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 3342 పాజిటివ్ కేసులు, 22 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో అక్టోబర్ 24, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,04,026 కు చేరగా, కరోనా వలన మరణించిన వారి సంఖ్య 6566 కి పెరిగింది. మరో 3572 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. కాగా గడిచిన 24 గంటల్లో 74,919 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించారు.
కరోనా వలన చిత్తూరులో నలుగురు, గుంటూరులో నలుగురు, కృష్ణాలో నలుగురు, అనంతపూర్ లో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, కడపలో ఒకరు, ప్రకాశంలో ఒకరు, విజయనగరంలో ఒకరు, పశ్చిమగోదావరిలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 6566 కి చేరింది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (అక్టోబర్ 24, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షలు: 75,02,933
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 8,04,026
- కొత్తగా నమోదైనా కేసులు : 3342
- నమోదైన మరణాలు : 22
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 7,65,991
- యాక్టీవ్ కేసులు : 31469
- మొత్తం మరణాల సంఖ్య : 6566
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu