ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి కరోనా వైరస్ ప్రభావం మరింతగా పెరుగుతుంది. దీంతో రికార్డ్ స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 8147 కరోనా పాజిటివ్ కేసులు, 49 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఒకేరోజు వ్యవధిలో ఇన్ని కేసులు నమోదవడం ఇదే తొలిసారి. అలాగే 2380 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారు.
కొత్తగా నమోదైన 8147 కేసులతో కలిపి జూలై 24, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 80858 కు చేరింది. గత 24 గంటల్లో 48114 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు. కరోనా వలన తూర్పు గోదావరిలో పదకొండు మంది, కృష్ణాలో తొమ్మిది మంది, కర్నూల్ లో ఎనిమిది మంది, శ్రీకాకుళంలో ఏడుగురు, పశ్చిమ గోదావరిలో ఐదుగురు, గుంటూరులో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు, చిత్తూరులో ఒకరు, విజయనగరంలో ఒకరు, ప్రకాశంలో ఒకరు మరణించడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 933 కి చేరింది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (జూలై 22, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షలు: 15,41,993
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 80858
- కొత్తగా నమోదైనా కేసులు : 8147
- నమోదైన మరణాలు : 49
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 39935
- యాక్టీవ్ కేసులు : 39990
- మొత్తం మరణాల సంఖ్య : 933
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu