ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) సమీర్ శర్మ నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఆదిత్యనాథ్ దాస్ సెప్టెంబర్ 30వ తేదీన పదవి విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎస్ గా సమీర్ శర్మను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నూతన సీఎస్ గా సమీర్ శర్మ అక్టోబర్ 1న బాధ్యతలు చేపట్టనున్నారు. 1985 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి సమీర్ శర్మ ఉమ్మడి ఏపీలో ఆప్కో, ఐటీడీసీ సీఎండీగా పనిచేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ