ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం కొనసాగుతుంది. వరుసగా ఆరో రోజు కూడా 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 10,004 కరోనా పాజిటివ్ కేసులు, 85 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 10,004 కేసులతో కలిపి ఆగస్టు 31, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 4,34,771 కు చేరింది. గత 24 గంటల్లో(9AM-9AM) 56,490 కరోనా పరీక్షలు నిర్వహించినట్టుగా తెలిపారు.
ఇక రాష్ట్రంలో కరోనా వలన నెల్లూరు జిల్లాలో పన్నెండు మంది, చిత్తూరులో తొమ్మిది మంది, ప్రకాశంలో తొమ్మిది మంది, కడపలో ఎనిమిది మంది, అనంతపూర్ లో ఏడుగురు, తూర్పుగోదావరిలో ఏడుగురు, గుంటూరులో ఏడుగురు, పశ్చిమగోదావరిలో ఏడుగురు, కర్నూల్ ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, శ్రీకాకుళంలో నలుగురు, కృష్ణాలో ఇద్దరు, విజయనగరంలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 3969 కి చేరింది. ఇక నమోదైన మొత్తం కేసుల్లో 3,30,526 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడగా, గత 24 గంటల్లోనే 8772 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో మరియు కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 100276 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu