ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 86,223 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 11,421 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2308, చిత్తూరులో 1658, అనంతపూర్ లో 1041, పశ్చిమగోదావరిలో 996 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17,28,577 కు చేరుకుంది.
ఇక కరోనా వలన మరో 81 మరణాలు చోటుచేసుకున్నాయి. చిత్తూరులో పదమూడు మంది, అనంతపూర్ లో తొమ్మిది మంది, శ్రీకాకుళంలో తొమ్మిది మంది, విజయనగరంలో ఏడుగురు, తూర్పుగోదావరిలో ఆరుగురు, నెల్లూరులో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, కృష్ణాలో ఐదుగురు, కర్నూల్ లో ఐదుగురు, పశ్చిమగోదావరిలో ఐదుగురు, గుంటూరులో నలుగురు, ప్రకాశంలో నలుగురు, కడపలో ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 11213 కి పెరిగింది. గత 24 గంటల్లో 16223 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 15,78,452 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,38,912 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ