ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 69,606 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 1,546 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా చిత్తూరులో 284, కృష్ణాలో 259, పశ్చిమగోదావరి జిల్లాలో 195, నెల్లూరులో 186, ప్రకాశంలో 185 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,71,554 కు చేరుకుంది.
ఇక కరోనా వలన మరో 18 మరణాలు చోటుచేసుకున్నాయి. చిత్తూరులో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు , తూర్పుగోదావరిలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, ప్రకాశంలో ఒకరు, శ్రీకాకుళంలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 13428 కి పెరిగింది. గత 24 గంటల్లో 1,940 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 19,37,956 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,170 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ