టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రకు ఫిబ్రవరి 19, బుధవారం నాడు శ్రీకారం చుట్టారు. ముందుగా ప్రకాశం జిల్లా నుంచి ఈ యాత్రను ప్రారంభించారు. వరుసగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో 45 రోజుల పాటు ప్రజా చైతన్య యాత్ర పేరుతో బస్సు యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తొమ్మిది రద్దులు, తొమ్మిది భారాలు, తొమ్మిది మోసాలు అనే ఎజెండాతో టీడీపీ పార్టీ ఈ యాత్రకు రూపకల్పన చేసింది.
చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర షెడ్యూల్:
- ఉదయం 11 గంటలకు బొప్పూడి చేరుకుని, అక్కడ ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేస్తారు
- 11.30 గంటలకు బస్సు యాత్ర ప్రారంభం
- మధ్యాహ్నం 12.30 గంటలకు మార్టూరు గ్రామ సెంటర్ లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు
- 12.50 గంటలకు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తారు.
- 2.20 గంటలకు మేదరమెట్ల టౌన్ సెంటర్ లో బహిరంగ సభ
- సాయంత్రం 6 గంటలకు ఒంగోలు అద్దంకి బస్టాండ్ సెంటర్లో బహిరంగసభ
- రాత్రి 8గంటలకు ప్రకాశం జిల్లా టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశం
- రాత్రి 10 గంటలకు ఉండవల్లి నివాసానికి తిరుగు పయనం
[subscribe]